సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇండియాలోనే అద్భుత రీతిలో నిర్మితంకానున్న ఈ ఆలయం కోసం ఇప్పటికే కోట్లాది ఇటుకలు, వందలాది రాతి స్తంభాలు సిద్ధమైన సంగతి తెలిసిందే.ఇక ఆలయం కోసం బీహార్ రాజధాని పట్నాలో ఉన్న హనుమాన్ మందిర్ రూ. 10 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆలయ కమిటీ, అధ్యక్షుడు కిశోర్ కుమార్ ఓ ప్రకటన చేస్తూ, ఆలయానికి ఏటా రూ. 2 కోట్లు అందిస్తామని, పనులు త్వరగా జరుగుతూ, ఆలయ నిర్మాణం ఇంకా ముందే పూర్తవుతుందని భావిస్తే, ఈలోగానే మొత్తం ఇస్తామని అన్నారు. అయోధ్యలో ఓ అన్నదాన భవనాన్ని సైతం తాము నిర్మిస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా అస్సాం రాష్ట్రానికి చెందిన కొంతమంది ముస్లిం కుటుంబాలు సైతం రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.వీరంతా రెక్కాడితే కానీ డొక్కాడని పేద తరగతికి చెందినవారు కావడం గమనార్హం..