అమరావతి : ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్గా వైకాపా ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి నియతుయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఈ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తూ వచ్చినందున లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కింది. వైకాపా మహిళా నేతల్లో ముఖ్యులుగా ఉన్న ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మలకు కూడా గతంలో కీలక పదవులు కట్టబెట్టారు. రోజాను ఏపీఐఐసీ చైర్పర్సన్గా, వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించారు.