హొసూరు : ఇక్కడికి సమీపంలోని మోరణపల్లి గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రతింగరా,కాలభైరవ ఆలయాల్లో పౌర్ణమిని పురస్కరించుకుని విశేష పూజలు, మిరపకాయలతో యాగాన్ని నిర్వహించారు. ఇక్కడ పౌర్ణమి పూజలను విశేష రీతిలో నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం ఆలయంలో ప్రతింగరాదేవి,
కాలభైరవస్వామికి పూజలు నిర్వహించి కర్పూర హారతినిచ్చారు. రాత్రి మిరపకాయాలతో యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహించడమే కాక యాగంలో మిరపకాయాలను వేసి మొక్కులు తీర్చుకొన్నారు. తరువాత అమ్మవారికి మహా మంగళహారతి నిచ్చి తీర్థ ప్రసాధ వినియోగం చేశారు.