పుణె : భారత్ తొలి ఇన్నింగ్స్ను 601/5 వద్ద డిక్లేర్ చేసిన అనంతరం తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌతాఫ్రికా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు విసిరే నిప్పులు చెరిగే బంతులకు సఫారీ బ్యాట్స్మెన్ పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు ఇద్దరూ ఉమేశ్ యాదవ్కు దొరికిపోగా, టెంబా బవుమా (8)ను షమీ వెనక్కి పంపాడు. మార్క్రమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఉమేశ్, మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత 33 పరుగుల వద్ద పేసర్ మహ్మద్ షమీ దక్షిణాఫ్రికాను మరో దెబ్బ కొట్టాడు. అతడి బౌలింగ్లో కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి బవుమా (8) అవుటయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లను కోల్పోయి 36 పరుగులు చేసింది.