ఇస్లామాబాద్: ‘కశ్మీర్ మా రక్తంలోనే ఉంది. కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు నిలబడతారు. పాక్ శాంతి మంత్రాన్ని జపిస్తున్నా భారత్ భయపెట్టాలని చూస్తోంద’ని పాక్ మాజీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ‘భారత్ కార్గిల్ యుద్ధాన్ని మరచిపోయిందేమో. యుద్ధం ముగిసే ముందు అమెరికా సాయాన్ని కోరింద’ ని వ్యాఖ్యానించారు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఏపీఎంఎల్) అధ్యక్షుడైన ఆయన అనారోగ్యంతో ఏడాదిగా దుబాయ్లో చికిత్స పొందు తూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జమ్మూ-కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దయిన తర్వాత మొదటి సారిగా మంగళ వారం స్పందిం చారు.కశ్మీర్ పౌరులకు అండగా ఉంటామని భరోసా నిచ్చారు. ‘పాకిస్తాన్ శాంతి కోరుకుంటోంది. దాన్ని బలహీనతగా భావించొద్ద’ని హెచ్చరించారు. ఆరోగ్యం కుదుట పడుతున్నంతున త్వరలో ఆయన రాజకీయాల్లోకి రానున్నారని పాక్ మాధ్యమాలు తెలిపాయి. 1999-2008పాక్ అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్, బెనజీర్ భుట్టో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.