కొత్త విద్యా విధానాన్ని నిరసిస్తూ డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన
హొసూరు : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని ఖండిస్తూ, డీఎంకే యువజన విభాగం బుధవారం హొసూరులోని రాంనగర్లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. కృష్ణగిరి పశ్చిమ జిల్లా యువజన విభాగం కార్యదర్శి రాజా అధ్యక్షతన జరిగిన ఈ ప్రదర్శనలో ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి వై. ప్రకాష్ పాల్గొన్నారు. కొత్త విద్యా విధాననం కింద 5, 8 తరగతుల విద్యార్థులకు కూడా పబ్లిక్ పరీక్షలు నిర్వహించడాన్ని ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తక్షణమే ఈ కొత్త విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్ఏ. సత్య, సుకుమార్, ధనలక్ష్మి, శ్రీనివాస రెడ్డి, చిన్న పిల్లప్ప ప్రభృతులు పాల్గొన్నారు.