హోసూరు : బెంగళూరు నుంచి డెంకణీకోటకు వెళుతున్న ప్రైవేట్ బస్సు పంచేశ్వరం గ్రామం వద్ద సోమవారం రాత్రి బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కెలమంగలం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు .ఈ ప్రమాదం పరిసర గ్రామాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. స్థానికులు తమ బంధు మిత్రుల యోగ క్షేమాల వాకబులో నిమగ్నమయ్యారు.