చెన్నై:తెలంగాణ కబడ్డీ ఆటగాళ్లపై తమిళనాడులో దాడి జరిగింది. ఇక్కడి అణ్ణాసలైలో బస్సు ఎక్కిన ఆటగాళ్లు ఎగ్మూర్ లో దిగారు. టికెట్ విషయం లో కండక్టర్తో వివాదమైంది. ఎగ్మూర్ లో దిగిన తర్వాత తెలంగాణ ఆటగాళ్లపై బస్ కండక్టర్ దాడి చేశాడు. కబడ్డి కోచ్ లక్ష్మణ్ తీవ్రంగా గాయ పడ్డాడు. స్థానికులు సెల్ ఫోన్ తో ఈ దాడిని వీడియో తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కబడ్డి ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.