అమరావతి : తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అసమాన నాయకుడు, ఉన్నతమైన వ్యక్తని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్లో కొని యాడారు. శుక్రవారం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు జగన్ నివాళులర్పించారు. ప్రకాశం పంతులు తెలుగు జాతి ఖ్యాతిని ఇనుమ డింప జేశారని శ్లాఘించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని, తరతరాలకు స్పూర్తి దాయ కమని పేర్కొన్నారు. ఇంకా తెలుగు రాష్ట్రాల ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలూ తెలిపారు. శ్రీ కృష్ణ భగవానుని జన్మదినాన వేడుకల్లో జనం కోరుకున్నవన్ని వారి సొంతం కావాలని, అన్ని వేళలా సకల సౌభాగ్యాలు లభించాలని ఆకాంక్షించారు.