ఇందు టెక్జోన్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.ఇందు టెక్జోన్ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసుకు సంబంధించి నిమ్మగడ్డ ప్రసాద్ వ్యక్తిగతంగా కోర్టులో విచారణకు హాజరు కాకపోవడంతో పాటు నిమ్మగడ్డకు హాజరు నుంచి వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలంటూ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేకపోవడంతో నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.నేర విచారణ చట్టం సెక్షన్ 317 (హాజరు మినహాయింపు) కింద పిటిషన్ దాఖలు చేసేందుకు తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రసాద్ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్రావు నివేదించారు. నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు గత వారం అరెస్టు చేసిన విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశామన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈడీ తరఫు న్యాయవాదులు హాజరుకాకపోవడంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను న్యాయమూర్తి కోర్టుకు పిలిచారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరగా.. ఈడీ తరఫు న్యాయవాది సెలవులో ఉన్నారని, కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు గడువు కావాలని కోరారు. న్యాయవాదిని నియమించుకున్నాక మెమోపై స్పందిస్తామన్నారు. తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 23కు వాయిదా వేశారు..