తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా పలు కోణాల్లో పలువురు దర్శకనిర్మాతలు బయోపిక్లు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ జాబితాలో రామ్గోపాల్ వర్మతో పాటు దర్వకుడు విజయ్ కూడా ఉన్నారు.అయితే విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బయోపిక్లో జయలలిత పాత్రలో బాలీవుడ్ సంచనల నటి కంగనా రనౌత్ నటిస్తుండడంతో దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సైతం ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో చిత్రానికి భారీతనం తీసుకురావడానికి కంగనా స్టార్ హోదాకు తగ్గట్టుగా ఉండాలని పెద్ద పెద్ద తారలను చిత్రంలోని ఇతర కీలకపాత్రల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.ఈ క్రమంలో తమిళనాడు ఎవర్ గ్రీన్ కథానాయకుడు మాజీ ముఖ్యమంత్రి,ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎమ్ జిఆర్ పాత్ర కోసం అరవింద్ స్వామిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జయలలిత రాజకీయ రంగంలో ఎదగడానికి ఎమ్ జి ఆర్ పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆ పాత్ర కోసం అరవింద్ స్వామికి భారీ పారితోషం ఇచ్చి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది..