ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్స్టార్ పవన్కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో జనసేన పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి.దీనికితోడు పవన్కళ్యాణ్ సైతం పార్టీ వ్యవహారాలపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో జనసేన జెండా ఎత్తేసిందని బీజేపీలో జనసేన విలీనం కానుందంటూ వార్తలు హల్చల్ చేశాయి ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి.అయితే పవన్ మాత్రం ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నా బీజేపీలో విలీనం వార్తలు మాత్రం ఆగడం లేదు.తాజాగా హీరోయిన్ మాధవి సైతం జనసేన పార్టీ బీజేపీలో విలీనం కావడం తథ్యమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2014లో బీజేపీకి మద్ధతు ఇచ్చిన పవన్…ఆ తర్వాత బయటకొచ్చారని…కానీ మళ్ళీ ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకుని పార్టీని విలీనం చేస్తారేమో అని – విలీనం చేస్తే బాగుంటుంది చెయ్యకపోతే ఆయన ఇష్టమని మాధవీలత చెప్పుకొచ్చింది.కాగా మొన్న ఎన్నికల్లో మాధవీలత బీజేపీ నుంచి గుంటూర్ వెస్ట్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఎన్నికల ముందు కూడా ఆమె పవన్ బీజేపీతో కలిసి పనిచేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా కలిసి పని చేసే అవకాశం ఉందని కూడా అన్నారు.