తెదేపా సభ్యుల వాకౌట్‌

తెదేపా సభ్యుల వాకౌట్‌

అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంగళవారం సభ నుంచి వాకౌట్ చేశారు. ముగ్గురు తెదేపా సభ్యుల్ని సస్పెండ్ చేయటంతో బాటు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వ లేదని ఆరోపించి వాకౌట్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామా నాయుడును సస్పెండ్ చేసారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడు తున్నా రనే కారణంతో వారి సస్పెన్షన్ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. అయినా వారు సభలోనే నినాదాలు చేశారు. సమావేశాలు ముగిసే వరకూ కాకుండా సభా సంప్రదాయాలు పాటించని వారిని శాశ్వతంగా బహిష్కరించాలని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos