ఛలో చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న గత ఏడాది విడుదలైన గీతగోవిందం చిత్రంతో దక్షిణాదిస్థాయిలో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది.తెలుగుతో పాటు తమిళం,కన్నడ భాషల్లో కూడా అగ్రహీరోలకు జోడీగా క్రేజీ సినిమాల్లో వరసు ఆఫర్లు దక్కించుకుంటున్నారు.ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్ స్థానం వైపుగా దూసుకుపోతున్నారు.ఇప్పటికే మహేశ్బాబుకు జోడీగా నటిస్తున్న రష్మిక మరిన్ని క్రేజీ సినిమాల్లో ఆఫర్లు కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక గీతగోవిందంతో హిట్పెయిర్గా కితాబులందుకున్న రష్మిక,విజయ్ దేవరకొండ జోడీగా నటించిన కొత్త చిత్రం డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రచారాల్లో భాగంగా రష్మిక చిత్రీకరణకు సంబంధించి పలు విషయాలు పంచుకున్నారు.చిత్రంలో కాసేపు క్రికెటర్గా కనించాల్సిన పాత్ర కోసం చిత్రబృందం బాగా టార్చర్ పెట్టారని వెల్లడించారు.సినిమాలో పది నిముషాలు మాత్రమే క్రికెట్ సీన్లు ఉంటాయని వాటి కోసం తనను బాగా ఇబ్బంది పెట్టారని తెలిపారు. పది నిమిషాల విజువల్స్ కోసం తనతో దాదాపు నాలుగు నెలల పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేయించారని.. చాలా దెబ్బలు తగిలాయని.. షూటింగ్ లో కూడా ఇరవై రోజుల పాటు తనను ఏడిపించారని వెల్లడించారు. కానీ మరీ పది నిమిషాల కోసం ఇలా చేయడం టూమచ్ అని డియర్ కామ్రేడ్‘ ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా వెల్లడించింది రష్మిక. అయితే ఇదంతా కంప్లైంట్ లా చెప్పడం లేదని.. ఇష్టంతోనే చెబుతున్నట్లు వెల్లడించింది. డబ్బింగ్ కోసం కూడా తనను బాగా ఇబ్బంది పెట్టారని దాదాపు మూడు నుండి నాలుగు నెలల పాటు డబ్బింగ్ చెప్పించారని.. దాదాపు ప్రతీరోజు డబ్బింగ్ చెప్పించారని రిలీజ్ కి ఇరవై రోజుల ముందు కూడా డబ్బింగ్ చెప్పించారని తెలిపింది.ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ సినిమా జర్నీని ఎంజాయ్ చేసానని షూటింగ్ అయిపోయినందుకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు.