వరుస సినిమాలతో అగ్రస్థానం దిశగా దూసుకుపోతున్న సమయంలో సినిమాలకు టాటా చెప్పేసి శృతి హాసన్ అభిమానులకు,ప్రేక్షకులకు షాకిచ్చింది.సినిమాలు మానేసి లండన్లో రాక్బ్యాండ్ ఏర్పాటు చేసి లైవ్ మ్యూజిక్ షోలు చేయడం మొదలుపెట్టింది.ఇదంతా మైఖెల్ కోర్సలెను పెళ్లి చేసుకోవడానికి చేసినట్లు అంతా భావించారు.అయితే కొద్ది రోజుల క్రితం మైఖెల్ కొర్సలెకు బ్రేకప్ చెప్పానని తామిద్దరం విడిపోయామంటూ మళ్లీ షాకిచ్చింది.మైఖెల్తో విడిపోయాక శృతి మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది.ఈ క్రమంలో తమిళంతో పాటు తెలుగులో కూడా నటించడానికి సిద్ధమైంది.ఈ క్రమంలో శృతికి హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.యు ఎస్ ఏ నెట్వర్క్స్ నిర్మించనున్న ‘ట్రెండ్ స్టోన్’ సిరీస్ లో ఓ కీలక పాత్రకోసం నిర్మాతలు శృతి హాసన్ ను సంప్రదించారని సమాచారం. జేసన్ బౌర్న్ సిరీస్ ఆధారంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎపిసోడ్స్ లో శృతి హాసన్ కనిపించనుంది. ఇందులో ఆమె వెయిట్రెస్గా కనిపిస్తూ సీక్రెట్ గా హత్యలు చేసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారట.ఇక ఈ ఎపిసోడ్కు రామిన్ బహ్రానీ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికా, భారత్లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.ఈ సీరీస్ విజయం అయితే కనుక, ప్రియాంక చోప్రా తరహాలోనే శృతి హాసన్ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..