
కోవూరు: రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఉనికి చారిత్రక అవసరమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. కుటుంబాల మధ్య రాజకీయాలు నలిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. . రాజకీయాలంటే రెండు పార్టీలు, నారా, జగన్ కుటుంబాలే చేయాలా? ఇంకెవరూ చేయొద్దా’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని మార్చేందుకే ఎన్నికల బరిలోకి దిగామన్నారు. వైకాపా నేతలు స్వార్థ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. పోలీసులపై నమ్మకం లేదంటూ వారిని అవ మాన పరుస్తున్నారని వ్యాఖ్యానించారు. పోలీసులపై ఇకనైనా విమర్శలు, ఆరోపణలు మానాలని హెచ్చరించారు. ‘నేను నెల్లూరులోనూ నివసించా. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో పెరిగా. ఇక్కడి రాజకీయాలు మార్చాలను కుంటున్నా ఇందుకు జన ఆశీర్వదించాల’ని కోరారు. ‘మాట్లాడితే బీసీలు అంటూ బీసీ సభలు పెడుతు న్నారని, ఎంతమంది బీసీలకు అండగా నిల బడ్డారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ లోని బీసీలను తెలంగాణలో ఓసీలుగా మార్చిన కేసీఆర్ను ఎందుకు ప్రశ్నించర’న్నారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నానని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు.