కశ్మీర్లో కాంగ్రెస్, ఎన్సీ మధ్య పొత్తు

శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం ఆరు లోక్సభ స్థానాల సర్దుబాటు గురించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ఎన్సీ నేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం ఇక్కడ మంతనాలు జరిపారు. చర్చల అనంతరం పొత్తు కుదిరినట్లు ఫరూక్ ప్రకటించారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా, ఒక స్థానంలో ఎన్సీ అభ్యర్థిని నిలపనుంది. జమ్మూ, ఉద్ధాంపూర్ స్థానాల్లో కాంగ్రెస్, శ్రీనగర్లో ఎన్సీ పోటీ చేయనున్నాయి. అనంతనాగ్, బారాముల్లాలో స్నేహ పూర్వక పోటీ ఉంటుందని ప్రకటించారు. శ్రీనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ ఫరూక్ అబ్దుల్లా పోటీ కి దిగనున్నారు. లడక్ స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లౌకిక పార్టీలతో పొత్తు ద్వారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పోటీలోకి దిగుతున్నట్లు ఫరూక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్తో బలమైన కూటమి వల్ల సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆగడాలను అడ్డుకోవచ్చని అభిప్రాయపడ్డారు. గెలుపు కోసం రెండు పార్టీల నాయకులంతా ప్రచారంలో పాల్గొంటారన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos