త్రిస్సూర్: తమ పార్టీ కేంద్రంలో అధికారాన్ని
చేపడితే మత్స్య కారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను
ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా తాను ‘మోస పూరిత హామీలు’ ఇవ్వబోనని స్పష్టీకరించారు. కేరళలోని త్రిస్సూర్లో గురువారం అఖిల భారత
మత్స్యకారుల మహాసభ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మత్స్యకార ప్రతినిధుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘‘2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ విజయాన్ని సాధించిన మరుక్షణమే,
దేశంలోని మత్స్యకారు లందరికీ ఢిల్లీ కేంద్రంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామ’ని
చెప్పారు. రు. ‘‘నేను నరేంద్రమోదీలా కాదు
బూటకపు హామీలు ఇవ్వబోను. నా ప్రసంగాలను ఒకసారి పరిశీలించండి. నేను చేయాలని
నిర్ణయించుకున్న దాన్నే చెబుతాను’ అని పేర్కొన్నారు.