అమరావతి:ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ బుధవారం వైకాపాలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వైకాపా అధినేత జగన్తో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే ఆ పార్టీలో చేరదలచినట్లు తెలిసింది. విజయవాడ లోక్సభ స్థానానికి ఆయన పోటీ చేయవచ్చని పార్టీ వర్గాల బోగట్టా. 2014 లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీకి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. విజయవాడ లోక్సభ స్థానానికి ఈ సారి వైకాపా అభ్యర్థిగా పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ పోటీ చేస్తారని భావించారు. అయితే ఇందుకు ఆయన సుముఖంగా లేక పోవటంతో వర ప్రసాద్ ఆ అవకాశాన్ని చేజిక్కించు కునేందుకు వైకాపా తీర్థాన్ని పుచ్చుకుంటున్నారని పరిశీలకుల మదింపు. పొట్లూరిని నాయకత్వం బలమైన అభ్యర్థిగా లెక్కగట్టిందని పార్టి వర్గాల కథనం. వరప్రసాద్ కల ఈ సారైన నెరవేరు తుందో లేదో చూడాలి.