ఇండో-పాక్ మధ్య విమానాల రాక పోకలు రద్దు

ఇండో-పాక్  మధ్య విమానాల రాక పోకలు రద్దు

న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని విమానాలు అర్థంతరంగా వెను తిరగ్గా, మరికొన్నింటిని  దారి మళ్లించారు. జమ్మూ- కశ్మీర్‌లోని పలు పౌర విమానాశ్రయాల్ని వాయుసే స్థావరాలుగా పరివర్తన చేసారు. పంజాబ్‌ అమృత్‌సర్‌ విమానాశ్రయంలోనూ పౌర విమాన సేవల్ని నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు విమానాశ్రయంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్‌ సైతం లాహోర్‌, ముల్తాన్‌, ఫైసలాబాద్‌, సియోల్‌కోట్‌, ఇస్లామాబాద్‌ విమానాశ్రయాల నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos