శ్రీనగర: జమ్ము కశ్మీర్లోని బుద్గాం పట్టణానికి ఏడు కి.మీల దూరంలోని గరెండ్ కలన్ వద్ద బుధవారంఉదయం పోరాట విమానం-మిగ్ కుప్ప కూలింది. ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
విమానం కుప్ప కూలడంతో ఆ ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. అధికార యంత్రాంగా వెంటనే౦ రంగంలోకి దిగి సహాయకచర్యల్ని చేపట్టింది. రోజువారీ సైనిక విన్యాసాల్లో ఈ దుర్ఘటన సంభవించిందా లేక యుద్ధ సన్నాహక కసరత్తులో ప్రమాదం జరిగిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.