విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోలేదని తప్పుబట్టారు. తాత్కాలిక ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దిల్లీ: తాము అధికారంలోకి వచ్చినపుడు విధి నిర్వహణలో కన్నుమూసిన పారామిలిటరి బలగాలకు అమర వీరుల హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం భరోసా ఇచ్చారు. ఇక్కడి జవాహర్ లాల్ నెహ్రూ క్రీడాంగణంలో జరిగిన -విద్య, దశ, దిశ -కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విధుల్లో భాగంగా మరణించిన పారా మిలిటరీ బలగాలకు అమరవీరుల హోదా ఇవ్వడం గురించి ఓ పరిశోధన విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు. ఆ గత ఐదేళ్లలో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వ వ్యయం చాలా తగ్గిందని విమర్శించారు. విద్యా రుణాల సులభ వితరణ, మరిన్ని సమస్యల పరిష్కారానికి విద్యా రంగానికి మరిన్ని నిధుల్ని వ్యయం చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు ఒక సైద్ధాంతిక విధానానికి కట్టుబడి, విద్యార్థుల ఆలోచన సరళికి, శాస్త్రీయ, అంతర్జాతీయ దృక్పథాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. ఇది విద్యారంగానికి చేటే కాకుండా అవమానమని వ్యాఖ్యానించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాలకులు ప్రయత్నించకపోవడం వల్ల దేశం తీవ్ర నిరాశలో ఉందన్నారు.