74 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు

  • In Money
  • January 29, 2019
  • 728 Views
74 చోట్ల ఏకకాలంలో ఐటీ దాడులు

చెన్నై: తమిళనాడులో ఆదాయపన్నుశాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెన్నై, కోయంబత్తూరు ప్రాంతాల్లోని 74 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శరవణ స్టోర్స్‌, రేవతి గ్రూప్‌, లోటస్‌ సంస్థలకు చెందిన నగలు, వస్త్ర దుకాణాల్లో ఈ ఉదయం నుంచి 150 మందికి పైగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయపన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో చూపించిన లెక్కలకు పొంతన కుదరడం లేదనే ఆరోపణలపై సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos