పెళ్లికి అథిధులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ చివరకు ఏడు మంది ప్రాణాలు బలి తీసుకుంది.సూడాన్ రాజధాని ఖార్తూమ్లో ఓ పెళ్లికి హాజరైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో విషయమై గొడవ మొదలైంది.చిన్నగా మొదలైన గొడవ శృతి మించడంతో అందులో ఒకరు తనవద్దనున్న గ్రనేడ్ను అవతలి వ్యక్తిపై విసిరాడు.దీంతో గ్రనేడ్ భారీ శబ్దంతో పేలడంతో ఘటనలో ఏడు మంది అక్కడిక్కడే మృతి చెందగా 25 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు.ఘటన జరిగిన వెంటనే వధూవరులు కుటుంబ సభ్యులతో కలసి పారిపోయారు..