గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం విషమంగా ఉంది. కాలేయ క్యాన్సర్కు చికిత్స పొంది కోలుకున్న మనోహర్ పారికర్.. తిరిగి ఇటీవలే ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స కోసం చేరారు. పారికర్ ఆరోగ్యం బాగోలేదని, దేవుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలని.. గోవా డిప్యూటీ స్పీకర్ మైఖేల్ లోబో తాజాగా వ్యాఖ్యానించారు. పారికర్ లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని పేర్కొన్నారు.