తన బావ అయోధ్య రామిరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేయకపోతే తాను నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయంలో తనకు ఆసక్తి లేదని అన్నారు. సీఎం చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని స్పష్టం చేశారు. తాను గౌరవం ఉండే పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని…టీడీపీలో తనకు గౌరవం లభిస్తోందని ఎమ్మెల్యే మోదుగుల అన్నారు.