15 ఏళ్ల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ చివరి వరకు ప్రయత్నించిన్పటికీ శివరాజ్సింగ్ ససేమిరా అనడంతో అధిష్టానం వెనక్కి వెళ్లిందన్న ప్రచారం జరిగింది.ముఖ్యమంత్రి సీనియర్ నేత కమల్నాథ్ ప్రమాణ స్వీకారం చేయగా, యువనేత జ్యోతిరాధిత్య సింధియా రాష్ట్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత శివరాజ్సింగ్ చౌహాన్ను జ్యోతిరాధిత్య సింధియా కలవడం చర్చనీయాంశంగా మారింది.సోమవారం భోపాల్కు వచ్చిన ఆయన తన సన్నిహితులను కలిసిన అనంతరం నిన్న రాత్రి శివరాజ్ను ఆయన నివాసంలో కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. అనంతరం సింధియా, చౌహాన్ బయటకి వచ్చి మీడియాతో మాట్లాడారు.
ఇది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఇరువురు స్పష్టం చేశారు. దీంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాము మర్యాదపూర్వకంగానే కలిశామని వారిద్దరూ చెప్పినప్పటికీ దీని వెనుక వేరే కారణాలు ఉన్నాయని కథనాలు వినిపిస్తున్నాయి.సీఎం కుర్చీ కోసం కమల్నాథ్, సింధియాల మధ్య పోటీ నడిచింది. అయితే అనుభవానికి పెద్దపీట వేసిన రాహుల్ గాంధీ కమల్నాథ్ వైపే మొగ్గుచూపారు. మరోవైపు వీరిద్దరి కలయికపై కాంగ్రెస్ స్పందించింది. అభివృద్ధి కార్యక్రమాల్లో చౌహన్ మద్దతు కోరేందుకే సింధియాను ఆయన కలిసినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్, బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న . శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా భేటీ రాజకీయ వర్గాల్లో సంచలనమైంది., తన సన్నిహిత మిత్రుల కుటుంబాలను పరామర్శించేందుకు సింధియా భోపాల్ వచ్చారని, అనూహ్యంగా బీజేపీ సీనియర్ నేత ఒకరితో కలిసి మాజీ సీఎం చౌహాన్ ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా ముచ్చటించారని కథనాలు వచ్చాయి. చౌహాన్ సైతం సింధియాతో ఆయన కారు వరకూ వెళ్లి సాగనంపారని తెలిపాయి. సమావేశానంతరం సింధియా మీడియాతో మాట్లాడుతూ, ‘జరిగిందేదో జరిగింది. విరోధాలతో జీవితం సాగించడం నాకు ఇష్టం ఉండదు’ అని పేర్కొన్నారు. ‘ఇది సుహృద్బావ భేటీ’ అని చౌహాన్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ నాయకత్వం తనను పక్కన పెట్టడంతో సింధియా అసంతృప్తితో ఉన్నారనే విషయం ఈ భేటీతో స్పష్టమవుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని సింధియా బలంగా ఆశించినప్పటికీ సీనియర్ నేత, సోనియాగాంధీ సన్నిహిత సహచరుడు అయిన కమల్నాథ్కు సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది.