పుల్వామా ఉగ్రదాడికి మెహబూబాయే కారణం

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీయే కారణమని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) ప్రొఫెసర్ అమితా సింగ్ ఆరోపించారు ప్రజా వాహనాల తనిఖీలో ముఫ్తీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే పుల్వామా దాడికి ప్రధాన కారణమని బుధవారం ట్వీట్‌ చేసారు. 

 ‘ఆర్‌డీఎక్స్ నిండిన వాహనాన్ని  భత్రతా సిబ్బంది తనిఖీ చేసే అవకాశం లేకుండా ఆ మార్గంలోని మూడు తనిఖీ కేంద్రాల్ని ఆమె తొలగించారు. గవర్నర్ గారూ.. దయచేసి వాటిని పునరుద్ధరించండి. 40 మంది సైనికులు చనిపోయారన్న బాధ నిజంగా మెహబూబా ముఫ్తీకి ఉంటే.. తన పొరపాటుకు పరిహారంగా 40 మంది తన మద్దతుదారులను బహిరంగంగా ఉరి తీసేందుకు అప్పగించాలి.’’ అని ఆక్రోశించారు.  అమిత్‌ సింగ్‌ ఆరోపణల్ని మెహబూబా ముఫ్తీ ఖండించారు.‘ఉన్నత చదువులు చదివిన ఓ వ్యక్తి ఇంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? ఆమె నిజంగా చదువుకున్నారా? కశ్మీరీలను వేధించాలన్న ఉద్దేశ్యంతో ఆమె కావాలనే  కట్టు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తోంది.’’ అని వ్యాఖ్యానించారు.పీడీపీ కూడా ఆమె వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ‘‘జేఎన్‌యూ ప్రొఫెసర్ కట్టుకథలు అల్లుతూ మెహబూబా ముఫ్తీపై హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారు. కశ్మీరీలను బహిరంగంగా ఉరితీయాలని చెబుతున్నారు. ఆమెపై ఢిల్లీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. దీనిపై మేము ఆందోళన చేపడతాం.’’ అని ఆ పార్టీ  ట్వీట్  చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos