గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన జోగులాంబ గద్వాల జిల్లాలోని ఓసర్పంచి అభ్యర్థిని వినూత్నహామీ ఇచ్చారు. తనను ఎన్నుకుంటే, పదవిలో ఉన్నంత కాలమూ ఊరి ఆడపిల్లలకు రూ.5,016 వంతున ‘పెళ్లి కానుక’ను సొంత డబ్బుతో అందజేస్తానని ప్రచారం సాగిస్తున్నారు. ఉండవల్లి సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచిన రేఖ సరికొత్త పంథా ఇది. మండలంలో అధికజనాభా (9500పైగా) ఉన్నది, ఓటర్లు 3,700మంది గలదీ ఈ గ్రామమే. వధువులకు కానుకలంటూ, కరపత్రాలు ముద్రించి ఇంటింటా ఆమె పంచుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్పథకాలు స్ఫూర్తిదాయకాలని చెబుతున్నారు.