ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో మొదలై సాయంత్రానికి కి జారు కున్నాయి. నిఫ్టీ 47పాయింట్ల నష్టంతో 10,783 వద్ద, సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంతో 36,034 వద్ద ముగిశాయి. రిలయన్స్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ షేర్ల కౌంటర్లలో చివరి గంటలో విక్రయాలు జరిగాయి. ఫలితంగా
మార్కెట్ నష్టాల్లోకి జారిపోయింది.నేటి ట్రేడింగ్ సెషన్లో దిలీప్ బిల్డ్కాన్ షేరు 13శాతం ఎగిసింది. చివరికి 9శాతం లాభంతో రూ.399.40 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లో కూడా ఈ షేరు 4శాతం లాభపడింది.అశోక్ లేల్యాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎడల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీస్, బీఏఎస్ఎఫ్ ఇండియా,నాట్కో ఫార్మా, రాలీస్ ఇండియాతో సహా బీఎస్ఈలోని 39 కంపెనీల షేర్లు 52వారాల కనిష్ఠాన్ని తాకాయి. ఈ ప్రభావం కూడా సూచీపై పడింది.