గాంధీనగర్ : లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉంఝా నియోజకవర్గం కాంగ్రెస్ శాసనసభ్యురాలు ఆషా పటేల్ శనివారంనాడు పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర తివారీకి ఇవాళ ఉదయం అందజేశారు. అయితే, ఆమె రాజీనామాకు కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. 2017 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఏడుసార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా ఉన్న నారాయణన్ పటేల్ను ఆషా ఓడించారు.