అమరావతి: చంద్రబాబు మరో కొత్త నాటకానికి తెరలేపారని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి బుధవారం ట్వీట్లో విమర్శించారు. ‘గతంలో ఆడపిల్ల పుడితే బ్యాంకులో రూ. 5 వేలు డిపాజిట్ చేస్తాం. పెళ్లి నాటికి 5 లక్షలు ఇస్తాం అని చెప్పి మోసం చేశారు. ఇప్పుడేమో ఆడపిల్ల వివాహానికి రూ.లక్ష ఇస్తాం అని నాటకం ఆడుతున్నారు. ఈ ఐదేళ్లు ఎందుకివ్వలేక పోయారు చంద్రబాబూ? కపటం, కుతంత్రాలకు పర్యాయ పదంగా మారారు’ అని దుయ్యబట్టారు.