కీలక పరిణామం.. బీజేపీ-జేడీఎస్ పొత్తు

కీలక పరిణామం.. బీజేపీ-జేడీఎస్ పొత్తు

న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలు-2024 లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నవేళ రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్సభ ఎన్నికలు-2024 కోసం జేడీఎస్తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తెలిపారు. కర్ణాటకలోని నాలుగు స్థానాల్లో జేడీఎస్ పోటీ చేస్తుందని వెల్లడించారు. మాండ్యా, హసాన్, బెంగళూరు(రూరల్), చిక్బల్లాపూర్ సీట్లను జేడీఎస్ కోరుతోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2019లో ఈ నాలుగు స్థానాల్లో మూడింట బీజేపీ గెలవగా.. కేవలం హసాన్లో మాత్రమే జేడీఎస్ గెలిచింది. జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవే గౌడ తుమ్కూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక దేవెగౌడ మనువడ, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమారస్వామి మాండ్యా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో జేడీఎస్ 10 శాతం కంటే తక్కువ ఓటు షేరును పొందింది. ఈ ఏడాదే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీఎస్కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 14 శాతం ఓట్లకే పరిమితమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos