ఉత్తరప్రదేశ్లో గత కొద్ది రోజులుగా జన్ధన్ ఖాతాల్లో పెద్ద మొత్తాలు జమ అవుతున్నాయి. మొరదాబాద్ జిల్లాలో 1,700 ఖాతాల్లో ఇలా జమ కావడంతో ఎన్నికల అధికారులు వాటిపై దృష్టి సారించారు. ఒక్కో ఖాతాలో రూ.పది వేలు చొప్పున రూ.1.7 కోట్లు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయం కనుక రాజకీయ పార్టీలకు చెందిన వారెవరైనా డిపాజిట్ చేశారా లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి జమ అయ్యిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.