ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు

ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనుకుంటున్నారు

ముంబై: దేశాన్ని విభజించి, ముంబై నగరాన్ని మహారాష్ట్ర నుంచి విడగొట్టి, కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) చేయాలనే కుట్రతో కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్ని నిర్వహిస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. ప్రతిపక్షాలు, పార్లమెంట్ వ్యవహారాల కమిటీతో సహా ఏ పక్షంతో కూడా సంప్రదింపులు చేయకుండా మోదీ సర్కార్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిందని తప్పుబట్టారు. కోవిడ్,9 సంక్షోభం, నోట్ల రద్దు, మణిపూర్ హింసాకాండ అంశాలపై ఏర్పాటు చేయని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇప్పుడు ఎందుకు? అని ప్రశ్నించారు.ముంబై నగరానికి ప్రపంచ ప్రాముఖ్యత ఉన్నందున నగరాన్ని అన్ని విధాలుగా దెబ్బ కొట్టి, ఇక్కడి సంస్థలు, కార్యాలయాలను బీజేపీ సర్కార్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్కు తరలించుకుపోతోందని ఆరోపించారు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ముంబైని వేరు చేసే కుట్రలో భాగంగా బాంబే స్టాక్ ఎక్సేంజీ, నేషనల్ స్టాక్ ఎక్సేంజీని తరలించాలనే ప్లాన్లో ఉన్నదని దుయ్యబట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos