అత్యంత కిరాతకంగా దిశపై హత్యాచారం చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసిన సైబరాబాద్ పోలీసులపై సామాన్య ప్రజలు ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో విజయవాడకు చెందిన టీ దుకాణం యజమాని సత్యనారాయణమూర్తి కూడా దిశ నిందితుల ఎన్ కౌంటర్పై హర్షం వ్యక్తం చేస్తూ రోజంతా తన దుకాణంలో టీ, కాఫీలు ఉచితంగా అందించాడు.ముగ్గురు కుమార్తెలకు తండ్రి అయిన సత్యనారాయణమూర్తిని కూడా దిశ ఉదంతం కదిలించి వేసింది. నిందితులను చంపేస్తే బాగుండు అనుకున్నవారిలో సత్యానారాయణ కూడా ఒకరు.అందుకే దిశ నిందితులు ఎన్కౌంటర్లో హతులయ్యారని తెలిసిన వెంటనే తన స్టాల్ కు వచ్చిన వారందరికీ డబ్బులు తీసుకోకుండానే టీ, కాఫీ అందించారు.