తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.కొద్ది రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని వెల్లడించడంతో దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు.క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం… ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో శ్రీదేవి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా? కాదా? అనే విషయంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలతో ఈనెల 26న మధ్నాహ్నం 3 గంటలకు తమ ముందుకు విచారణకు రావాలని శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు..