కోర్టు తీర్పుపై యువరాజ్ హర్షం..

  • In Sports
  • January 9, 2020
  • 152 Views
కోర్టు తీర్పుపై యువరాజ్ హర్షం..

నిర్భయ దోషులకు పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడంపై దేశవ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.నిందితులను ఉరిశిక్ష సరైన శిక్షేనని ఇప్పటికైనా శిక్ష అమలవుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. నిర్భయ కేసులో ఏడేళ్ల తర్వాత వచ్చిన తీర్పుపై యువరాజ్ హర్షం వ్యక్తం చేశాడు. ఎట్టకేలకు న్యాయం జరిగిందన్నాడు. కోర్టు తీర్పును ప్రజలు, ప్రముఖులు హర్షిస్తున్నట్టు పేర్కొన్నాడు. తీర్పు చెప్పిన ఢిల్లీ కోర్టుకు వందనమన్నాడు. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుందని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా, పాటియాలా కోర్టు తీర్పు ప్రకారం నెల 22 ఉదయం ఏడు గంటలకు నిర్భయ దోషులు పవన్ గుప్తా, ముకేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మలను ఉరి తీయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే తీహార్ జైలులో జరుగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos