రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

హోసూరు : ఇక్కడికి సమీపంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. రాయకోట వైపు నుంచి హోసూరుకు రైలు ఇంజిన్ వస్తుండగా హోసూరు సమీపంలోని జొనబండ గ్రామం వద్ద సుమారు 30 ఏళ్ల వయసు గల యువకుడు అడ్డంగా దూసుకెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనను చూసిన ఇంజిన్ డ్రైవర్ హోసూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనపరచుకొని విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడి పూర్వాపరాలను తెలుసుకోవడానికి రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos