యడియూరప్ప వర్క్ ఫ్రం హోమ్

యడియూరప్ప వర్క్ ఫ్రం హోమ్

బెంగళూరు : కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పనిచేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప తెలిపారు. శుక్రవారం కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించడానికి బీబీఎంపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పని చేస్తున్నానని తెలిపారు. ప్రజలెవరూ భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. కర్ణాటకలో ఇప్పటి వరకు 30,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos