యువతి ఫోన్‌ కాల్‌తో పరుగులు పెట్టిన పోలీసులు..

యువతి ఫోన్‌ కాల్‌తో పరుగులు పెట్టిన పోలీసులు..

తమ బిడ్డకు అనారోగ్యంగా ఉందని, మందులు కొనడానికి డబ్బులు లేవని, ఆకలి బాధను తప్పించుకోవడానికి అన్నం లేదని, పరిస్థితుల్లో ఆత్మహత్య మినహా మరో మార్గం లేదని యువతి నుంచి ఫోన్ రావడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఘటన చండీగఢ్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తాను, తన భర్త, బిడ్డ మరణించనున్నామని, లాక్ డౌన్ కారణంగా పని లేకపోయిందని యువతి ఫోన్ చేసింది. వెంటనే ఫోన్ నంబర్ ఆధారంగా ప్రాంతానికి డీఎస్పీ దిల్ షేర్ సింగ్, ఇతర పోలీసులు వెళ్లారు. కుటుంబానికి ఆహారం, కొంత డబ్బును అందించి, బిడ్డకు వైద్యానికి ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos