హోసూరు : స్థానిక తాలూకాఫీసు ముందు వర్షపు నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందలు పడుతున్నారు. హోసూరు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తమ సొంత పనులపై వందల సంఖ్యలో తాలూకాఫీసుకు వచ్చి వెళుతుంటారు. నిత్యం రద్దీగా ఉండే తాలూకాఫీసు ముందు వర్షపు నీరు నిలువ వుండడంతో కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజలు లాంగ్ జంప్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రధాన గేటు ముందే వర్షపు నీరు నిలిచినా తాలూకాఫీసులో పని చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శల కు దారి తీస్తోంది. తాలూకాఫీసు ప్రధాన ద్వారం వద్ద ఏర్పడిన పల్లపు ప్రాంతానికి మట్టి నింపి వర్షపు నీరు నిలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కార్యాలయానికి వచ్చి వెళ్లే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.