వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామని బెదిరింపులు..

వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామని బెదిరింపులు..

ప్రముఖ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌ను చంపేస్తామంటూ బెదిరించిన ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.వందేమాతరం శ్రీనివాస్ కు ఫిలింనగర్ లో ఉండే తిరుపతయ్యతో కొన్నేళ్ల క్రితం పరిచయమైంది. అలా పెరిగిన వారి పరిచయం.. మరింత ముందుకు వెళ్లింది. ఇదిలా ఉండగా 2018 జూన్ లో కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన తన మామను తిరుపతయ్య పరిచయం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా అప్పుగా కొంత మొత్తం కావాలంటే వారిని నమ్మిన శ్రీనివాస్‌ పలు దఫాలుగా రూ.30 లక్షలు ఇచ్చారు.మూడు.. నాలుగు నెలల్లో అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానంటూ నమ్మకంగా తీసుకున్నఅతను.. ఆ తర్వాత నుంచి ముఖం తప్పిస్తున్నాడు. దీంతో.. నెల క్రితం తన స్నేహితుడైన మధుసూదన్ రెడ్డితో కలిసి తిరుపతయ్య ఇంటికి వెళ్లి డబ్బులు అడిగారు. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన తిరుపతయ్య.. డబ్బులు గురించి ఎత్తితే చంపేస్తానని బెదిరింపులకు దిగటంతో షాక్ తిన్నారు వందేమాతరం శ్రీనివాస్. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos