శబరిమల:అయ్యప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం ఆరంభించింది. ముసుగుల్ని ధరించి, కరోనా వ్యాధి లేదనే పత్రంతో భక్తులు శబరిమలకు చేరుకుంటున్నారు. మండల పూజ అక్టోబరు 21 వరకు జరపనున్నారు. నీలక్కల్లో రాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. భక్తులు వర్చువల్ విధానంలో శనివారం దర్శనానికి 246 మంది దరఖాస్తు చేసుకున్నారు. రోజుకు కేవలం 250మందినే ఆలయంలోకి అనుమతించనున్నారు.