తనను కెలికడం ఎంత ప్రమాదకరమో భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కొహ్లీ మరోసారి చూపించాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మైదానం వేదికగా భారత్-వెస్టీండీస్ జట్ల మధ్య శుక్రవారం మొదటి టీ20 మ్యాచ్ జరిగింది.అందులో కొహ్లీ వీరవిహారంతో భారత్ విజేతగా నిలిచింది.కాగా మ్యాచ్ మధ్యలో వెస్టిండీస్ ఆటగాడు విలియమ్స్ను ఉద్దేశించి కోహ్లీ.. బుక్ తీసి టిక్ కొట్టినట్లు చేసిన సంజ్ఞ నెట్టింట్లో వైరల్గా మారుతోంది. గత వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీని ఔట్ చేసినప్పుడు విలియమ్స్ చేసిన సంబరాలను దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చాడు.దీన్ని బిగ్బి తన డైలాగ్తో వర్ణించారు. ‘విరాట్ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్పై నెటిజన్లు,బిగ్బీ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు..
#ViratKohli don't mess with Kohli
If ur bad he's ur dad🔥🔥 pic.twitter.com/YsDNipUlMJ— Venky Tarak (@VenkyTa77508681) December 7, 2019