లక్నో: గూండా వికాస్ దూబేను శుక్ర వారం ఉదయం పోలీసులు కాల్చి చంపారు. మధ్యప్రదేశ్, ఉజ్జయినిలో గురువారం పట్టుబడిన దూబేను శుక్రవారం కాన్పూర్కు తరలిస్తున్నపుడు తను ప్రయాణించిన వాహనం బోల్తా పడింది. దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దరిమిలా పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతడిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు తెలుస్తోంది. వికాస్ను పట్టుకునేందుకు ప్రయ త్నించిన పోలీసుల్లో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.