యువతకు ఉద్యోగాల్లేవు

యువతకు ఉద్యోగాల్లేవు

న్యూ ఢిల్లీ : భాజపా ఎంపీ వరుణ్ గాంధీ మరోమారు సొంత ప్రభుత్వంపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, వారు ఇంకెంత కాలం సహనంతో ఉండాలని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అవకాశం వచ్చినా, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. పరీక్ష రాసినా.. ఏళ్ల తరబడి ఫలితాలు వెలువడటం లేదు. ఏదో ఒక కారణంగా పరీక్షనే రద్దు చేసేస్తున్నారు. రైల్వే గ్రూప్ డీ పరీక్షల ఫలితాల కోసం 1.25కోట్ల మంది రెండేళ్లుగా ఎదురు చూస్తు న్నారు. ఆర్మీ నియామకాలకు ఇదే పరిస్థితి. దేశ యువత ఇంకెంత కాలం ఓపికతో ఉండాలి?’అని సొంత ప్రభుత్వాన్ని వరుణ్ గాంధీ గురువారం ట్వీట్లో నిలదీశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos