జూదశాల నిర్వహించలేదు

జూదశాల నిర్వహించలేదు

గుడివాడ : పట్టణంలో జూదశాల నిర్వహించలేదని తెదేపా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలిపారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా కోడి పందాలు, పేకాట శిబిరాలు కొనసాగాయి. మంత్రి కొడాలి నాని అనారోగ్యంతో బాధపడినందున నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనన్నారు. నా స్నేహితుల గురించి కొడాలి నానికి తెలియదు. తెదేపా హయాంలో నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు కూడా జరిగాయి. . రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తెదేపా నిజ నిర్ధారణ సమితి పేరుతో అలజడి రేపుతోంది. అమ్మాయిలు చేసిన డ్యాన్సుల్లో అర్ధ నగ్న దృశ్యాలు లేవు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. టీడీపీ అధికారిక వెబ్ సైట్లలో కొడాలి నాని పై, తనపై పోస్టింగులు పెట్టిస్తున్నార’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos