భారత్ కు అమెరికా అండ

భారత్ కు  అమెరికా అండ

వాషింగ్టన్: కరోనా వైరస్ పై పోరుకు 64 దేశాలకు అమెరికా మొత్తంగా 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్ డాలర్ల సహాయానికి ఇది అదనం. భారత దేశానికి 2.9 మిలియన్ డాలర్లు అందనుంది. ప్రయోగశాలల అభివృద్ధి, కరోనా పీడితెలపై నిరంతర పర్యవేక్షణ, సాంకేతికత అభవృద్ధికై ఈ సహాయం చేసినట్లు అమెరికా ప్రభుత్వం వివరించింది. ఇంకా శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్కు 1.8 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్కు 3.4 మిలియన్ డాలర్లు, అఫ్గనిస్తాన్కు 5 మిలియన్ డాలర్లు వంతున ఆమెరికా సాయం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos