దుబాయ్ : భారత యువ జట్టు అండర్-19 ఆసియా కప్ను గెలుచుకుంది. దుబాయ్లో శుక్రవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్స్ లో యువ ఆటగాళ్లు తొమ్మిది వికెట్ల విజయాన్ని సొంతం చేసుకున్నారు. వర్షం వల్ల అంతరాయం ఏర్పడిన ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్నుఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 38 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగారు. తదనంతరం డక్వర్త్ లూయిస్ పద్ధతిలో భారత జట్టు విజయ లక్ష్యాన్ని 102 పరుగులుగా నిర్దేశించారు. ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ అజేయంగా అర్ధ సెంచరీ చేయడంతో భారత విజయం నల్లేరుపై నడకలా సాగింది. ఇండియా ఆసియా కప్ టైటిల్ను ఏడు సార్లు గెలుచుకుంది.